ప్రభుత్వ పధకాలు
1. ప్రధాని రోజ్గార్ యోజన:
ఈ పధకంలో పరిశ్రమలు, సేవా సంస్ధలకే కాకుండా, వ్యాపారం చేసుకోవటానికి కూడా ఆర్ధిక సహాయం అందించబడుతుంది. ఒక్కరు గానీ లేక 5 గురు గానీ సమ్యుక్త భాగస్వామ్యంతో ఋణం పొందవచ్చు. ఎటువంటి హామీ అవసరం లేకుండా, రూ. 1.00లక్ష వరకు ఋణపరిమితి కల్గి ఉంటుంది. ఈ పధకం. మొత్తం ప్రాజెక్టు విలువలో అభ్యర్ధి / అభ్యర్ధిని 5% మార్జిన్ మనీని భరించాలి. 'మార్జిన్ మనీ' అంటే పరిశ్రమ ప్రారంభించే వ్యక్తి పెట్టే పెట్టుబడి. సదరు ప్రాజెక్టు విలువలో 15% రు. 7,500/- లు మించకుండా రాయితీ ఇవ్వబడుతుంది. బ్యాంకు నిర్దేశము మేరకు ఋణమును 3 నుండి 7 సంవత్సరాల కాల పరిమితిలో వాయిదాల పద్ధతిన చెల్లింపవచ్చును.
ఈ పధకంలో లోన్ మంజూరు అయిన తరువాత ఆయా అభ్యర్ధులకు వారు ఎంచుకున్న పరిశ్రమ/ వ్యాపారానికి అవసరమయ్యే స్వల్పకాలిక శిక్షణ యివ్వబడుతుంది. అందులో వ్యాపారము, సేవా సంస్ధల వారికి రూ. 150/- లు మరియు పరిశ్రమ వారికి రూ. 300/- లు స్టైఫండ్గా ఇవ్వబడుతుంది. ఈ పధకం క్రింద కుటుంబంలో ఒక్కరికి మాత్రమే లోన్ శాంక్షన్ అవుతుంది. అదే కుటుంబంలోని మరో సభ్యుడికి రెండవసారి ఋణం మంజూరు చేయబడదు.
ఈ పధకంలో లోన్ మంజూరు అయిన తరువాత ఆయా అభ్యర్ధులకు వారు ఎంచుకున్న పరిశ్రమ/ వ్యాపారానికి అవసరమయ్యే స్వల్పకాలిక శిక్షణ యివ్వబడుతుంది. అందులో వ్యాపారము, సేవా సంస్ధల వారికి రూ. 150/- లు మరియు పరిశ్రమ వారికి రూ. 300/- లు స్టైఫండ్గా ఇవ్వబడుతుంది. ఈ పధకం క్రింద కుటుంబంలో ఒక్కరికి మాత్రమే లోన్ శాంక్షన్ అవుతుంది. అదే కుటుంబంలోని మరో సభ్యుడికి రెండవసారి ఋణం మంజూరు చేయబడదు.
ఈ లోన్ ఎవరికి లభిస్తుంది ? కనీస అర్హతలేమిటి ?
విద్యార్హతలు : ఎస్.ఎస్.సి. / మెట్రిక్ (పాస్ లేదా ఫెయిల్) లేక ఐ.టి.ఐ. కనీస విద్యార్హతలు కల్గి ఉండాలి.
వయసు : దరఖాస్తు చేయు అభ్యర్ధికి 18-35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఆదాయం : అన్ని వనరుల నుండి కుటుంబ వార్షిక ఆదాయం రు.24,000/- లకు మించరాదు.
నివాసం : దరఖాస్తు చేయు అభ్యర్ధులు కనీసం 3 సంవత్సరాల కాలం సంబంధిత జిల్లా నివాసి అయి ఉండాలి.
రిజర్వేషన్ : ఎస్.సి.,ఎస్.టి.లకు 22.5 శాతము, బి.సి.లకు 27 శాతము జిల్లా లక్ష్యములో రిజర్వేషన్ మరియు మహిళలకు ప్రాధాన్యత యివ్వబడుతుంది.
అపరాధము: అభ్యర్ధి ఏ జాతీయ బ్యాంకు లేదా కో - ఆపరేటివ్ బ్యాంకు ఆర్ధిక సంస్ధకు ఋణం చెల్లించకుండా అపరాధం చేసి ఉండరాదు. దరఖాస్తు నమూనాలను జిల్లా పరిశ్రమల కేంద్రాలను నుండి, మండల రెవిన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి మరియు రెవిన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల నుండి పొందవచ్చును. పూర్తి చేసిన దరఖాస్తులను కావలసిన సర్టిఫికేట్ల డూప్లికేట్లతో జతపర్చి అభ్యర్ధులు ఏజిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లా పరిశ్రమల కేంద్రానికి స్వయంగా కానీ, పోస్టు ద్వారా గానీ పంపవచ్చును.
మరిన్ని వివరాలకు: జిల్లా పరిశ్రమల కేంద్రం (లేదా)
కమీషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆంధ్రప్రదేస్ ప్రభుత్వము
కమీషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆంధ్రప్రదేస్ ప్రభుత్వము
2. చీఫ్ మినిష్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ (సి.ఎం.ఇ.వై. పధకం) :
యువజన సంఘం అంటే: ఈ కార్యక్రమం "గ్రూప్ స్ట్రేటజీ" పై ఆధారపడి ఉంది. 18 - 35 సం||రాల వయోవర్గంలోని 5 నుండి 15 యువజనుల కలయికే ఇది రిజిస్ట్రేషన్ - అధిక లాభాలు: ఆంధ్రప్రదేశ్ సొసైటీల చట్టం, 1995 పరస్పర సహాయక సహకార చట్టం / కంపెనీల చట్టం / భాగస్వామ్య పత్రం క్రింద రిజిష్టరు అయిన యువజన సంఘం, తన పేరు మీద ఋణాన్ని పొందడానికి ఏదైనా బ్యాంకును కోరవచ్చును. అంతేకాక, ఈ విధంగా రిజిష్టరైన యువజన సంఘం మార్జిను మనీ / సబ్సిడీ వంటివి పొందడానికి ఎస్.సి / ఎస్.టి / బి.సి. / మైనారిటీలు / మహిళా ఆర్ధిక సంస్ధలు / డి.ఆర్.డి.ఏ. / కె.వి.ఐ.బి. వంటి ఏజన్సీలతో తన కార్య కలాపాలను విస్తరించుకోవచ్చు.
అమలు విధానం: రాష్ట్రంలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు యువజన సేవలను, ప్రయోజనాలను విస్తరింపచేయాలనేది ప్రభుత్వ విధానం. దీన్ని మూడు దశలుగా విభజించారు.
మొదటి దశ: మొదటి దశలో "పైలటు" ప్రాతిపదికన ఒక్కొక్క మండలంలోనూ రెండు గ్రామాలను ఎంపిక చేస్తారు. మొదటి దశలో మున్సిపల్ ప్రాంతాలు తప్ప, ఇతర అన్ని మండల ప్రధాన కార్యాలయ ప్రాంతాల్లో చేపడతారు. ఒక మండలంలో అదనంగా మరో గ్రామాన్ని జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రితో సంప్రదించి ఎంపిక చేయవచ్చు. ఆ గ్రామ జనాభా 2,500 - 3,000 మధ్య ఉండాలి.
రెండవ దశ: దీనిలో మొదట చేపట్టని 5 - 10 గ్రామాలను ఎంపిక చేస్తారు.
మూడవ దశ: ఈ దశను పట్టణ ప్రాంతాలకు కూడా వర్తింపచేస్తారు.
ప్రాజెక్టుల ఎంపిక: ఎట్టి పరిస్ధితిలోనూ ఒకే గ్రామానికి పదికి మించి యువజన సంఘాలు ఉండరాదు. సంఘం ఏర్పడ్డాక గుర్తింపు నిమిత్తం జిల్లా యువజన సంక్షేమ అధికారికి, మండల యువజన ఎంపవర్మెంటు ఆఫీసరు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామానికి చెందిన స్వాభావిక పరిస్థితులు, సాంఘిక - ఆర్ధిక స్ధితిగతులు, స్ధలాకృతిని బట్టి ప్రాజెక్టును ఎంపిక చేసుకోవాలి. యువజన సంఘానికి సేవింగ్స్ బ్యాంక్ అక్కౌంట్ ఉండాలి. బ్యాంకులో వేసే డిపాజిట్లు, విత్డ్రాయల్సు, సమావేశపు తీర్మానాల ద్వారా మాత్రమే చేయాలి.
ఆర్ధిక సహాయం వివరాలు:
యువజన సంఘం సభ్యులు గ్రూప్ సేవింగ్స్ ద్వారా 15,000 రూపాయలు జమ చేయాలి. దానికి మ్యాచింగ్ గ్రాంట్గా 15,000 రూపాయలు లభిస్తాయి. యువజన సంఘానికి గ్రూప్ లోన్ సబ్సిడీగా 50,000 రూపాయలను సమకూర్చుతుంది ప్రభుత్వం. ఇదే కాకుండా, ఎస్.సి./ ఎస్.టి./బి.సి./ మైనారిటీలు / వికలాంగులు / మహిళలకు "మార్జిన్ మనీ"గా మరో 20 వేల రూపాయలు అందిస్తుంది. ఈ వర్గాలకు చెందని ఇతర యువజన సంఘాలకు యువజన సంక్షేమ శాఖ ద్వారా 20,000 రూపాయల మార్జిన్ మనీ లభిస్తుంది.
ఆర్ధిక వనరులు | S.C./S.T./B.C./Min/P.H./Ladies | ఇతర యువజన సంఘాలు |
1. గ్రూప్ సేవింగ్స్2. మ్యాచింగ్ గ్రాంట్ 3. గ్రూప్లోన్ సబ్సిడీ 4. మార్జిన్ మనీ 5. యువజన సంక్షేమ శాఖ మార్జిన్ మనీ | రూ. 15,000-00 రూ. 15,000-00 రూ. 50,000-00 రూ. 20,000-00 పరిస్థితిని బట్టి మారును | రూ. 15,000-00 రూ. 15,000-00 రూ. 50,000-00 పరిస్థితిని బట్టి మారును రూ. 20,000-00 |
శిక్షణ: అవసరమైన శిక్షణను మండలం, జిల్లా స్ధాయిలో ఒక మాస్టర్ క్రాప్ట్స్మెమెన్ ద్వారా గానీ, ఏదైనా సంస్థ ద్వారా కానీ ట్రైసెం కింద ఇప్పించబడుతుంది.
ప్రాజెక్టుల మంజూరు: మండల యువజన ఎంపవర్మెంటు ఆఫీసరు దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయి మంజూరు సంఘానికి దాఖలుపరుస్తారు. ఈ సంఘంలో జిల్లా కలెక్టర్ చైర్మెన్గా వ్యవహరిస్తారు. ఇంకా పి.డి., డి.ఆర్.డి.ఏ., ఇ.డి., డి.ఎస్. బి.సి. / మైనారిటీలు / మహిళలు, జి.ఎం., డి.ఐ.సి., జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేతృత్వం వహించే బ్యాంకు మేనేజరు, స్థానిక పరిశ్రమల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
సి.ఎం.ఇ.వై.లో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు:
1.విత్తన ఉత్పత్తి: మార్కెటింగ్ 2. పండ్లతోటల పెంపకం - ఉత్పత్తి 3. పండ్ల చెట్ల ప్రూనింగు, అందులో శిక్షణ 4. తోటపని పువ్వుల పెంపకం 5. పుట్టగొడుగుల ఉత్పత్తి 6. మంచినీటి కొలనులు, చెరువుల్లో చేపల పెంపెకం 7. చేపపిల్లల ఉత్పత్తి పెంపకం 8. ఉప్పునీటి కయ్యల్లో చేపలు, రొయ్యల పెంపకం 9. చేపల, రోయ్య పిల్లల సేకరణ 10. తేనె తయారీ 11. వైద్య ప్రయోజనాల నిమిత్తం ఓషధి మూలికలు, మొక్కల సాగు 12. కోళ్ళ పెంపకం 13. పందుల పెంపకం 14. గొర్రెలు, మేకల పెంపకం 15. వ్యవసాయం 16. చిన్నతరహా సాగునీటి పధకం 17. భూమి కొనుగోలు
రెండవ ప్రాధాన్యత రంగాలు:
1. అగ్గిపెట్టెల తయారీ 2. బాణాసంచా తయారీ 3. అగర్ఒత్తుల తయారీ 4. వంట నూనెలు కాని తైలాల తయారీ 5. సబ్బుల పరిశ్రమ 6. చర్మ ఉత్పత్తుల పరిశ్రమ 7. గ్రామీణ కుమ్మరి పరిశ్రమ 8. గానుగనూనె పరిశ్రమ 9. చేతితో చేసిన కాగితం 10. చెరకు బెల్లం తయారీ 11. తాటిబెల్లం, ఇతర తాటి ఆధార ఉత్పత్తుల తయారీ 12. అటవీ ఉత్పత్తుల నుండి ఇతర పదార్ధాల తయారీ 13. పప్పు, తృణ ధాన్యాల ప్రాసెసింగ్ 14. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, పరిరక్షణ క్యానింగ్ 15. రొట్టెలు, మిఠాయిల తయారీ 16. తేనె ప్రాసెసింగ్ 17. చేతి వృతులు 18. సున్నపు ఉత్పత్తుల పరిశ్రమ 19. వెదురు, పేముపరిశ్రమ 20. అల్యూమినియంతో గృహోపకర పాత్రలు తయారీ 21. పట్టు పరిశ్రమ.
ఇవే కాకుండా పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమలు, నిర్మాణాలు, రవాణా, చిల్లర వర్తకం, బ్యాంకింగ్, బీమాంశాలకు చెందిన ప్రాజెక్టులను కూడా మంజూరుచేస్తారు. పైన చూపిన జాబితా ఉదాహరణ మాత్రమే. ఇంకా అనేక రంగాల ప్రాజెక్టులను సాధించుకోవచ్చును.
ఇవే కాకుండా పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమలు, నిర్మాణాలు, రవాణా, చిల్లర వర్తకం, బ్యాంకింగ్, బీమాంశాలకు చెందిన ప్రాజెక్టులను కూడా మంజూరుచేస్తారు. పైన చూపిన జాబితా ఉదాహరణ మాత్రమే. ఇంకా అనేక రంగాల ప్రాజెక్టులను సాధించుకోవచ్చును.
మరిన్ని వివరాలకు:స్పెషల్ కమీషనర్, యువజన సంక్షేమ సర్వీసెస్, బోట్స్ క్లబ్, సికింద్రాబాద్
3.స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణా కార్యక్రమం(ట్రైసం)
ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అనే జాతీయ పధకాన్ని 1979 లో ప్రారంభించారు. హరిజన, గిరిజన యువతకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందీ స్కీమ్.
ఆదాయం : వార్షిక ఆదాయం 3,500 రూపాయల కన్నా తక్కువ ఉండాలి.
వయసు : 13-35 సంవత్సరాల మధ్యవారై ఉండాలి.
విద్యార్హత : కనీసం పదవ తరగతి చదివి ఉండాలి.
స్థానిక సర్వీసింగ్ యూనిట్లు, పారిశ్రామీక యూనిట్ల ద్వారానూ, వృత్తి పనివారు, నైపుణ్యం గల వారితోనూ శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ కాలంలో స్టైఫండ్, అనంతరం టూల్కిట్ను అందజేస్తారు. చదువురాని వారికి సైకిల్ రిపేర్, పాదరక్షల తయారీ లాంటివి నేర్పిస్తారు. కనీసం 10వ తరగతి చదివిన అభ్యర్హులకు రేడియో టెక్నాలజీ, ఎయిర్ కండిషనింగ్, ఫిట్లర్, ఫ్లంబర్, మోటార్ మెకానిజం, మోటార్ రీవైండింగ్, ముద్రణ లాంటివి ఎన్నో కోర్సుల్లో శిక్షణనిచ్చి, సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందిస్తారు. పరిశ్రమను బట్టి ఋణం మంజూరవుతుంది.
కూల్డ్రింక్స్ షాపుకు 9 వేలు, చిన్న బట్టల దుకాణం 10వేలు, పుస్తకాల షాపు 10వేలు, నోట్బుక్ తయారీ 6 వేలు, తేనెటీగల పెంపకం 6 వేలు, సైకిల్ షాపు 8 వేలు, లాండ్రీ షాపు 3 వేలు ఇలా ఋణం మంజూరవుతుంది. యూనిట్ విలువలో మూడో వంతు సబ్సిడీ లభిస్తుంది.
స్థానిక సర్వీసింగ్ యూనిట్లు, పారిశ్రామీక యూనిట్ల ద్వారానూ, వృత్తి పనివారు, నైపుణ్యం గల వారితోనూ శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ కాలంలో స్టైఫండ్, అనంతరం టూల్కిట్ను అందజేస్తారు. చదువురాని వారికి సైకిల్ రిపేర్, పాదరక్షల తయారీ లాంటివి నేర్పిస్తారు. కనీసం 10వ తరగతి చదివిన అభ్యర్హులకు రేడియో టెక్నాలజీ, ఎయిర్ కండిషనింగ్, ఫిట్లర్, ఫ్లంబర్, మోటార్ మెకానిజం, మోటార్ రీవైండింగ్, ముద్రణ లాంటివి ఎన్నో కోర్సుల్లో శిక్షణనిచ్చి, సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందిస్తారు. పరిశ్రమను బట్టి ఋణం మంజూరవుతుంది.
కూల్డ్రింక్స్ షాపుకు 9 వేలు, చిన్న బట్టల దుకాణం 10వేలు, పుస్తకాల షాపు 10వేలు, నోట్బుక్ తయారీ 6 వేలు, తేనెటీగల పెంపకం 6 వేలు, సైకిల్ షాపు 8 వేలు, లాండ్రీ షాపు 3 వేలు ఇలా ఋణం మంజూరవుతుంది. యూనిట్ విలువలో మూడో వంతు సబ్సిడీ లభిస్తుంది.
మరిన్ని వివరాలకు: సంబంధిత మండల కార్యాలయం.
4.నెహ్రూ రోజ్గార్ యోజన
ఈ పధకం ప్రకారం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 11,800 లు మాత్రమే ఉండాలి. అలాంటి కుటుంబ సభ్యునికే ఇది వర్తిస్తుంది. దీనిలో టి.వి. మెకానిజం, రేడియో మెకానిజం, రిఫ్రిజిరేషన్ కోర్సుల్లో, ఇంకా అనేక కోర్సుల్లో శిక్షణనిస్తారు. ఇవే కాక డ్రై క్లీనింగ్, లాండ్రీ, రెడీమెడ్ గార్మెంట్స్, బుక్ బైండింగ్, వెల్డింగ్ వర్క్ మొదలైన వాటికి సంబంధిత బ్యాంకులు ఋణాన్ని అందిస్తాయి. అభ్యర్ధి 3 సంవత్సరాలు ఒకేచోట నివాసం ఉండాలి. తమ ఆదాయాన్ని రూఢీపరుస్తూ తెల్ల రేషను కార్డు ప్రతిని అధికారులకు అందించాలి.
ఈ పధకం క్రింద లబ్ది పొందగోరు వ్యక్తి ఏ బ్యాంకుకు గానీ, సంస్ధకు గానీ బకాయి ఉండరాదు. అంతకు ముందు రుణం పొంది ఉండరాదు. బ్యాంకు వారు ఇచ్చే ఋణంలో 25% సబ్సిడీ లభిస్తుంది. స్త్రీలకు, ఎస్.సి., ఎస్.టి.లకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు.
ఈ పధకం క్రింద లబ్ది పొందగోరు వ్యక్తి ఏ బ్యాంకుకు గానీ, సంస్ధకు గానీ బకాయి ఉండరాదు. అంతకు ముందు రుణం పొంది ఉండరాదు. బ్యాంకు వారు ఇచ్చే ఋణంలో 25% సబ్సిడీ లభిస్తుంది. స్త్రీలకు, ఎస్.సి., ఎస్.టి.లకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు.
5.ఐ.ఆర్.డి.పి. (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం):
(సమగ్ర గ్రామీణాభివృద్ధి పధకం)
ఈ పధకాన్ని 1979 లో ప్రారంభించారు. గ్రామసభ, సర్పంచ్, సమితిస్థాయి అధికారుల సహాయంతో కుటుంబాలను ఎంపిక చేసి ఋణం అందజేస్తారు. జాతీయ బ్యాంకులు ఇచ్చే ఋణాలతో మూడింట ఒక వంతు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకుంటాయి. వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలకు ఈ ఋణాన్ని వినియోగించవచ్చు. ఈ పధకానికి వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు ఆర్ధిక సహకారం అందించేలా ' రీఫైనాన్స్ ' అనే కొత్త పధకం ప్రారంభించారు. దీని వల్ల వ్యవసాయేతర వృత్తుల్లో ఉన్న గ్రామీణులు వస్తువును ఉత్పత్తి చేయడమే కాక, దీని పంపిణీని సైతం సులభంగా చేపడుతున్నారు.
ఐ.ఆర్.డి.పి. పధకంలో లభించిన ఋణంతో వ్యవసాయం, పశుసంవర్ధనకు చెందిన పనులు చేసుకోవచ్చు. పంపుసెట్లు, పాడి ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు కొనుగోలు చేయవచ్చు. పశుసంవర్ధన ఆధారంగా పాలు, పాల ఉత్పత్తుల అమ్మకం, గ్రుడ్లు, మాంసం వంటివి పరిశ్రమలుగా అభివృద్ధి చేయవచ్చు. ఇవే కాక మరెన్నో కుటీర పరిశ్రమలను నెలకొల్పవచ్చు. ముఖ్యంగా ఈ ఐ.ఆర్.డి.పి. పధకం మహిళల పాలిట ఆశాకిరణంగా చెప్పవచ్చును. ఈ పధకం క్రింద ౠణాన్ని పొందగోరే వారు తమ గ్రామ సర్పంచ్ లేదా సమితిస్ధాయి అధికారులను కలవాలి.
ఐ.ఆర్.డి.పి. పధకంలో లభించిన ఋణంతో వ్యవసాయం, పశుసంవర్ధనకు చెందిన పనులు చేసుకోవచ్చు. పంపుసెట్లు, పాడి ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు కొనుగోలు చేయవచ్చు. పశుసంవర్ధన ఆధారంగా పాలు, పాల ఉత్పత్తుల అమ్మకం, గ్రుడ్లు, మాంసం వంటివి పరిశ్రమలుగా అభివృద్ధి చేయవచ్చు. ఇవే కాక మరెన్నో కుటీర పరిశ్రమలను నెలకొల్పవచ్చు. ముఖ్యంగా ఈ ఐ.ఆర్.డి.పి. పధకం మహిళల పాలిట ఆశాకిరణంగా చెప్పవచ్చును. ఈ పధకం క్రింద ౠణాన్ని పొందగోరే వారు తమ గ్రామ సర్పంచ్ లేదా సమితిస్ధాయి అధికారులను కలవాలి.
మరిన్ని వివరాలకు:సంబంధిత మండల కార్యాలయంలో సంప్రదించాలి.